భయంకర కరోనా వైరస్పై ప్రపంచం పోరాడుతోంది. ఆ మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టాలని భారత ప్రభుత్వం 21 రోజులపాటు దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించింది. కరోనా పోరాటంలో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రా ప్రభుత్వాలు తీసుకుంటోన్న చర్యలు, కార్యక్రమాలకు చాలా డబ్బు ఖర్చవుతుంది. అందుకనే, ఈ కష్టకాలంలో ప్రభుత్వాలకు తమ వంతు సాయం అందిస్తున్నారు టాలీవుడ్ స్టార్లు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, నితిన్, అనిల్ రావిపూడి, దిల్ రాజు వంటి సినీ ప్రముఖులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధులకు విరాళాలు అందజేశారు.
అయితే, లాక్డౌన్ కారణంగా సినీ పరిశ్రమలో రోజువారీ వేతనానికి పనిచేసే ఎంతో కార్మికులు తమ ఉపాధిని కోల్పోయారు. సినిమా షూటింగ్లు లేకపోతే వారంతా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే, వారిని ఆదుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం ప్రకటించారు. ఫిల్మ్ వర్కర్స్ సహాయార్థం కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నానని చిరంజీవి ట్వీట్ చేశారు.